కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్ ఒకటి. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా రెండు భాగాలుగా రూపొందుతోంది అని సమాచారం. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి, శోభిత దూళిపాళ, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, పొన్నియిన్ సెల్వన్ సినిమా IMAX ఫార్మాట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. తమిళ సినిమా చరిత్రలో అలా చేసిన మొదటి చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఈ ఫార్మెట్లో సినిమా ఎలా ఉంటుందనేది ఇప్పుడు సినీప్రేమికులకు ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.
![]() |
![]() |