బాహుబలి, RRR సినిమాలకు కథను అందించి, రాజమౌళి ఆస్దాన రచయితగా మారిపోయిన ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ గారు లేటెస్ట్ గా మరొక బహుభాషా చిత్రానికి రచయితగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది.
బెంగాలీ నవలిస్ట్ బంకిం చంద్ర ఛటర్జీ రాసిన ప్రముఖ నవల "ఆనందమత్" ఆధారంగా 1770 - ఏక్ సంగ్రామ్ అనే సినిమాను ఇటీవలే అధికారికంగా ఎనౌన్స్ చేసారు. బంకిం చంద్ర ఛటర్జీ 128వ వర్ధంతి మరియు వందేమాతరం 150 ఏళ్ళు నిండిన సందర్భంగా ఈ సినిమాను ఎనౌన్స్ చేసారు.
ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కన్నడం, తమిళం, మలయాళం, తెలుగు, హిందీ, బెంగాలీ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేసారు.