2019లో విడుదలైన మలయాళ చిత్రం "లూసిఫర్" ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్టోరియల్ డెబ్యూగా రూపొందిన ఈ చిత్రంలో మోహన్ లాల్ లీడ్ రోల్ పోషించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక విలన్ పాత్రలో నటించారు.
లేటెస్ట్ ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ ను లాక్ చేశామని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్తామని అభిమానులకు తెలుపుతూ, మేకర్స్ స్పెషల్ వీడియోను విడుదల చేసారు.
L 2 ఎంపురాన్ పేరుతో రూపొందబోతున్న ఈ సీక్వెల్ చిత్రానికి మురళి గోపి రచయితగా పని చేసారు. లూసిఫర్ ఫస్ట్ పార్ట్ ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" గా రీమేక్ చేస్తున్నారు.
![]() |
![]() |