పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ "లైగర్" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన 8 వారాల తర్వాత మాత్రమే ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల, టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతి సినిమా విడుదలైన 8 వారాల తర్వాతనే OTTలో విడుదల చేయాలనీ వెల్లడించారు. కాబట్టి లైగర్ మూవీ టీమ్ ఈ కొత్త నియమాన్ని అనుసరించాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.