శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కెప్టెన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఆగస్ట్ 22, 2022న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం సెప్టెంబర్ 8, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ఈ యాక్షన్ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందించారు. ది షో పీపుల్తో కలిసి థింక్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa