దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్గా నటిస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గురువారం ఘనంగా జరిగింది . హీరో హీరోయిన్స్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మందడి కిషోర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి హనుమంతరావు, కృష్ణా రావు, గరుడవేగ అంజి, హుషారు ఫేమ్ తేజస్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దర్శకత్వ బాధ్యతను మాత్రమే కాకుండా కథ, కథనం, మాటలు కూడా మారేష్ శివన్ అందించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకానుంది. ‘అలా నిన్ను చేరి’ సినిమాకు పాటలు చంద్రబోస్, సంగీతం సుభాష్ ఆనందన్ అందిస్తుండగా.. పి.జి. వింద కెమెరామెన్గా పని చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa