ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను మళ్లీ ఎప్పటిలా మాట్లాడగలుగుతున్నఅంటున్న నటి శ్రీవాణి

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 04:26 PM

తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లోఅలాగే జబర్ధస్ మరియు శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షో లోను నటించింది నటి శ్రీవాణి. గత నెలలో ఆమె అరుదైన వ్యాధి బారిన పడింది. దీని కారణంగా ఆమె గొంతు తాత్కాలికంగా మూగబోయింది. కొంచెం గట్టిగా మాట్లాడినా ఆమె గొంతు ఎప్పటికీ పోతుందని వైద్యులు హెచ్చరించడంతో నెల రోజుల నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. తాజాగా ఆమె తీసుకున్న చికిత్స విజయవంతమైంది.దీంతో ఆమె మళ్లీ ఎప్పటిలా మాట్లాడగలుగుతోంది. ఈ సంతోషకర విషయాన్ని తెలియజేస్తూ ఆమె యూట్యూబ్‌లో వీడియో వదిలింది. డాక్టర్‌ సూచన మేరకు జూలై 19 నుంచి ఆగస్టు 19 వరకు అస్సలు మాట్లాడలేదు. కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మాట్లాడేశా. ఈ సమయంలో నాకోసం ఎంతోమంది ప్రార్థించారు. వారందరికీ చాలా థ్యాంక్స్‌ అని చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa