ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికది నరకం లాగా ఉంటుంది

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 02, 2022, 03:59 PM

బుల్లితెర యాంకర్‌, గాను అలాగే  సినిమాలలో నటించారు  రష్మిగౌతమ్‌. జంతువులంటే ప్రాణమిచ్చే రష్మీ వాటి కోసం ఎంతో సేవ చేస్తుంటారు. కరోనా సమయంలో ఆహారం లేక అలమటిస్తున్న జంతువులకు ఆమె స్వయంగా ఆహారం తీసుకెళ్లి దగ్గరుండి తినేలా చేశారు. అలాగే జంతువులపై హింసను ఖండిస్తూ, జంతువుల పట్ల ఎలా మెలగాలో సోషల్‌ మీడియా వేదికగా చెబుతుంటారు. అలాంటి వ్యక్తిని ఓ నెటిజన్‌ హిందూ వ్యతిరేకి అని అభివర్ణించాడు. అతనిపై రష్మీ మండిపడ్డారు. స్మూత్‌గా తానెంటో వివరణ ఇస్తూ ట్వీట్‌ చేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... బుధవారం వినాయక చవితి సందర్భంగా ఓ భారీ వినాయకుడికి కొందరు భక్తులు గజరాజుతో పూలమాలను వేయించారు. ఓ పక్క హెవీ ట్రాఫిక్‌, జనాల మఽధ్య గజరాజు ఇబ్బంది పడుతూ ఆ మాలను గణేశునికి అలంకరించింది. ఆ వీడియో చూసిన రష్మీ.. ట్వీట్‌ చేసి ‘‘ఆ మాలను సమర్పించే సమయంలో ఆ గజరాజు ఎంతగా ఇబ్బంది పడిందో’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వినోదం కోసం జంతువులను వినియోగించరాదంటూ అభ్యర్థిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్‌ ‘‘మీరు జంతు ప్రేమికులేమీ కాదని మాకు తెలుసు. పక్కా హిందూ వ్యతిరేకులు’’ అని వ్యాఖ్యానించాడు. ఆ నెటిజన్‌కు రష్మీ గురువారం వివరణ ఇచ్చారు. ‘‘నేను నంది, గోమాతలను గౌరవిస్తాను. ఆ కారణంగానే  లెదర్‌ ఉత్పతులను వినియోగించను. అంతే కాదు పాల పదార్థాలను కూడా తినను. ఎందుకంటే మనం వినియోగించే పాలను ఉత్పత్తి చేయడం కోసం గోమాత ఎన్నోసార్లు గర్భం దాల్చుతుందనే నిజాన్ని నేను భరించలేను. మహిళగా రుతుక్రమంలో వచ్చే ఆ మూడు రోజుల నొప్పి కూడా నాకెంతో నరకంలా ఉంటుంది’’ అని రష్మీగౌతమ్‌ పేర్కొన్నారు. ‘‘అన్ని సౌకర్యాలు ఉన్న మనమే చిన్న నొప్పిని భరించలేని పరిస్థితుల్లో ఉంటే.. నోరు లేని మూగ జీవాలు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి’’ అనే అర్థం వచ్చేలా రష్మీ చేసిన ట్వీట్‌కు సోషల్‌ మీడియాలో మద్దతు పెరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa