ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేడీ ప్రొడ్యూసర్ కు అడవిశేష్ క్షమాపణలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 05:53 PM

మేజర్ సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ త్వరలోనే హిట్ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.
నిన్న సాయంత్రం జరిగిన "శాకినీడాకిని" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శేష్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాకినీ డాకిని నిర్మాతల్లో ఒకరైన తాటి సునీత గారికి శేష్ సారీ చెప్పారు. మేజర్ సినిమాలో శోభితా ధూళిపాళ్ల తల్లిగా సునీత గారు నటించారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే సునీత గారి సీన్లను ఎడిటింగ్ లో లేపేశారు. ఇన్నాళ్లకు ఆమెను కలిసే అవకాశం రావడంతో మరో క్షణం ఆలోచించకుండా శేష్ సునీతకు క్షమాపణలు చెప్పారు.
పోతే, శాకినీ డాకిని సినిమాను సునీతగారు డి. సురేష్ బాబు, హ్యూన్ వూ థామస్ కిమ్ లతో కలిసి నిర్మించారు.సెప్టెంబర్ 16న థియేటర్లలో ఈ మూవీ విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa