"మత్తు వదలరా" ఫేమ్ శ్రీ సింహ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం "దొంగలున్నారు జాగ్రత్త". ఇందులో డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్రఖని క్రూషియల్ రోల్ లో నటిస్తున్నారు.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ నుండి బిగ్ అప్డేట్ ఇచ్చారు. దొంగలున్నారు జాగ్రత్త థియేట్రికల్ ట్రైలర్ ను రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
తెలుగులో ఫస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సతీష్ త్రిపుర దర్శకుడు కాగా, కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, మంజర్ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి నిర్మిస్తున్న ఈ చిత్రం లో ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటిస్తుంది. పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదల కాబోతుంది.