టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపు రాజమండ్రిలో ప్రారంభం కానుంది అని సమాచారం. ఈ షెడ్యూల్లో విలేజ్ సీక్వెన్స్లను మూవీ మేకర్స్ రూపొందించనున్నారు. రేపటి నుంచి రవితేజ కూడా ఈ సినిమా సెట్స్లోకి జాయిన్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా అక్టోబర్ 5, 2022న తెలుగు మరియు హిందీలలో విడుదల కాబోతోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ సింహా పవర్ఫుల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.