కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్ ఒకటి. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, కమల్ హాసన్, చిరంజీవి, మమ్ముట్టి, ఉపేంద్ర మరియు అజయ్ దేవగన్ ఈ పాన్-ఇండియన్ చిత్రానికి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో వాయిస్ ఓవర్ అందించినట్లు సమాచారం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.
![]() |
![]() |