మహర్షి, నాంది సినిమాలతో హిట్ కొట్టిన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ ఆనంది కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' అనే టైటిల్ను ఖరారు చేశారు. అల్లరి నరేష్ ఈ సినిమాలో ఎలక్షన్ డ్యూటీపై గ్రామానికి వెళ్లే స్కూల్ టీచర్గా కనిపించనున్నాడని సమాచారం.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా నవంబర్ 11, 2022న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అదే విషయాన్ని ప్రకటించడానికి మూవీ మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తుండగా, హాస్య మూవీస్ అండ్ జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa