ఇషాన్ సూర్య దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విష్ణు మంచు ఒక సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్ మరియు బాలీవుడ్ యాక్ట్రెస్ సన్నీలియోన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'జిన్నా' అనే టైటిల్ను లాక్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను దసరా సందర్భంగా అక్టోబర్ 5, 2022న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమా అక్టోబర్ 21న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తన సొంత బ్యానర్ ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి అనూప్ రూబెన్స్ సంగీత అందిస్తున్నారు.