బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేష్ టాలీవుడ్ లోకి హీరోగా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'స్వాతిముత్యం' తో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 2 న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6:00 గంటల నుండి జరుగుతుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్సె ని మూవీ మేకర్స్ సంక్రాంతికి విడుదల చేయగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈ చిత్రంలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ కథానాయికగా కనిపించనుంది. స్వాతిముత్యం సినిమా అక్టోబర్ 5, 2022న దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రావు రమేష్, సుబ్బరాజు, హర్షవర్ధన్, గోపరాజు రమణ, ప్రగతి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.