బోయపాటి శ్రీను- నందమూరి బాలకృష్ణలది క్రేజీ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్బస్టర్ హిట్స్ అనటంలొ సందేహంలేదెవ్వరికీ. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో... మరో సినిమా రానుందని నందమూరి బాలకృష్ణ ప్రకటించాడు.
‘ఎన్.టీ.ఆర్’ కథానాయకుడు చిత్ర ఆడియో రిలీజ్ వేడుకలో తన తర్వాతి సినిమా బోయపాటితోనే అని బాలయ్య ప్రకటించడంతో అభిమానుల హర్షధ్వానాలకు అడ్డేలేకుండా పోయింది. పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాకి రూ. 100 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కించాలని బోయపాటి, బాలయ్య ఫిక్స్ అయినట్టు సమాచారం. బాలయ్య కెరీర్లనే ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ అయ్యే అవకాశం ఉంది
వచ్చే ఏడాది ఫిబ్రవరి (మాఘ మాసం)లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రోమో కూడా విడుదల చేశారు. కాగా ఈ సినిమా బడ్జెట్ గురించి హాట్ హాట్ చర్చ ఇండస్ట్రీలొ ఆరంభమైంది. హ్యాట్రిక్ మూవీకి శ్రీకారం చుట్టిన సక్సస్జోడిపైనే అందరి కళ్లు ఉన్నాయి. నందమూరి నట సింహం చిత్రానికి పలు పవర్ఫుల్ టైటిళ్లని బోయపాటి పరిశీలిస్తున్నాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడే ఆస్కారం ఉందని ఫిలింనగర్ వర్గాల భోగట్టా!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa