ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిఎస్టీ బ‌కాయిదారు మ‌హేష్ బాబు

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 27, 2018, 10:01 PM

టాలీవుడ్ ప్రముఖ హీరో మహేశ్ బాబు బ్యాంకు ఖాతాను అటాచ్ చేశామని జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) హైదరాబాద్ కమిషనరేట్ గురువారం సాయంత్రం (27.12.2018) ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం...
2007-08 ఆర్థిక సంవత్సరానికి గాను మహేశ్ బాబు ప్రభుత్వానికి సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదు. ఆ ఏడాది వివిధ ఉత్పత్తుల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌ / అప్పియరెన్స్ మనీ / అడ్వర్టైజింగ్ మొదలైన వాటి ద్వారా ఆయన అందించిన సేవలకు (లభించిన మొత్తంపై) చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేదు. అప్పట్లో ఆ మొత్తం 18.5 లక్షల రూపాయలు.
గురువారం జీఎస్టీ డిపార్ట్‌మెంట్ యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లోని మహేశ్ బాబు ఖాతాలను అటాచ్ చేసింది. పన్ను, వడ్డీ, పెనాల్టీల రూపంలో 73.5 లక్షల రూపాయలు రికవరీ చేసేందుకు ఈ అటాచ్‌మెంట్ జరిపినట్లు జీఎస్టీ కమిషనరేట్ పేర్కొంది. టాలీవుడ్‌లో అగ్ర హీరో అయిన మహేశ్ బాబు 18.5 లక్షల రూపాయలను దాదాపు పదేళ్లుగా చెల్లించకపోవటం, దాని రికవరీకి జీఎస్టీ కమిషనరేట్ ఆయన బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయటం వెనుక కారణాలను కనుగొనేందుకు బీబీసీ తెలుగు ప్రయత్నించింది. పేరు వెల్లడించకూడదనే షరతు కింద జీఎస్టీ విభాగం ఉన్నతాధికారి ఒకరు కొంత సమాచారం ఇచ్చారు. మహేశ్ బాబు కొన్ని ఉత్పత్తుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆయా ఉత్పత్తుల (కొనుగోళ్లను) ప్రోత్సహిస్తోంది కాబట్టి, ఆ మేరకు సదరు ఉత్పత్తుల తయారీ సంస్థ నుంచి తీసుకునే పారితోషకంపై సర్వీస్ ట్యాక్స్ కట్టాలని అధికారులు కోరారు.
అయితే, ఒక ప్రజాకర్షణ కలిగిన నటుడిగా తాను ఆయా ఉత్పత్తుల తయారీ సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతున్నానని, అందుకు అవసరమైన ఏర్పాట్లు, ఖర్చులు వాళ్లే చూసుకుంటున్నారని, ఇందులో తాను సేవల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని మహేశ్ బాబు తరపు ప్రతినిధులు తెలిపారు.
జీఎస్టీ ఉన్నతాధికారి ఇచ్చిన సమాచారం మేరకు ఈ అంశంపై మహేశ్ బాబు ఛార్టర్డ్ అకౌంటెంట్ ఒకరు పన్ను వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై మహేశ్ బాబు ప్రతినిధి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఉపశమనం లభించలేదు. ఈ క్రమంలో కట్టాల్సిన పన్ను... దానిపై వడ్డీ, పెనాల్టీ మొత్తం కలిపి 73.5 లక్షల రూపాయలు అయ్యిందని అధికారులు తెలిపారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa