కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్ అండ్ నిర్మాత బోనీ కపూర్తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి 'తునివు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ హీస్ట్ డ్రామా జనవరి 10, 2023న విడుదల కానుంది అని సమాచారం. ఈ సినిమాలో అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్లు సంచలనం సృష్టించాయి. ఈ సినిమా సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన సాలిడ్ అప్డేట్ను వెల్లడించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా మొదటి సింగిల్ చిల్లా చిల్లా అనే టైటిల్ ని పెట్టగ ఈ పాట ని సౌత్ ఇండియన్ సెన్సేషన్ అనిరుధ్ పడినట్లు సమాచారం. అనిరుధ్ గతంలో అజిత్కి ఆలామా డోలుమా వంటి అద్భుతమైన చార్ట్బస్టర్ను అందించాడు. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ ఇక్కడ కూడా అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ చిత్రం బ్యాంకు దోపిడీకి సంబంధించినదని, అజిత్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతునట్లు సమాచారం. సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని బోనీ కపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పిపై నిర్మించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.