కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ బేస్డ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా "మట్టి కుస్తీ". తమిళం, తెలుగు ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి చెల్లా అయ్యావు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తమిళంలో ఈ సినిమా టైటిల్ "గట్ట కుస్తీ".
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ హక్కులను ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ కొనుగోలు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.
విష్ణు విశాల్ తో కలిసి మాస్ రాజా రవితేజ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2న తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa