తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన "మట్టి కుస్తీ / గట్ట కుస్తీ"కి సంబంధించి కొంతసేపటి క్రితమే ట్రైలర్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఈ మేరకు రేపు రాత్రి ఎనిమిదింటికి మట్టి కుస్తీ ట్రైలర్ విడుదల కాబోతుందని తెలుపుతూ మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ సినిమాలో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్నారు. మాస్ రాజా రవితేజ సొంత నిర్మాణసంస్థ RT టీం వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల రెండవ తేదీన తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa