ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "పుష్ప ది రైజ్" సినిమా గతేడాది డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చార్ట్బస్టర్గా నిలిచింది. ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమా 2021లో అతిపెద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో సునీల్, రావు రమేష్, అనసూయ, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించరు. ఇప్పుడు, అందరూ పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ కేథరీన్ థ్రెసా విలన్ పాత్రలో కనిపించనుంది అని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. పుష్ప సినిమాతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో తన అభిమానులను అండ్ ప్రేక్షకులను మరోసారి అలరించడానికి రెడీ అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందించారు.