చిత్రం : 18 పేజెస్
సంగీతం : గోపీసుందర్
గాయకులు : పృథ్వి చంద్ర, సితార కృష్ణకుమార్
సాహిత్యం : శ్రీమణి
పల్లవి :
ఏ కన్నుకి ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా
ఏ నడకది ఏ పయనమో
ఏ పాదమైనా చూపేనా
నీలో స్వరాలకే
నేనే సంగీతమై
నువ్వే వదిలేసిన పాటై సాగనా..
నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా
ఏ కన్నుకి ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా
చరణం 1:
నిన్నెవరో పిలిచి రమ్మని అన్నట్టు
ఏ వైపుకో ఓ.. నువ్వెళ్లినా
నాకెవరో చెప్పినట్టు
నీ పనులే చేస్తున్నా ఒట్టు
నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా
ఏ కన్నుకి ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా
ఏ నడకది ఏ పయనమో
ఏ పాదమైనా చూపేనా
నీలో స్వరాలకే
నేనే సంగీతమై
నువ్వే వదిలేసిన పాటై సాగనా..
నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా