మహేశ్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఆగిపోయిన ఈ సినిమాను మళ్లీ పట్టాలెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 8 నుంచి మహేశ్ మళ్లీ సెట్స్ లోకి అడుగు పెడతారని టాక్ . ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.