నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'వీరసింహారెడ్డి'. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయినిగా శృతి హాసన్ నటించింది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది.