ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎట్టకేలకు..చిరుని లైన్లో పెట్టిన పూరి..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 07, 2022, 10:13 PM

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ను "చిరుత" తో ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత డైరెక్టర్ పూరి జగన్నాధ్ దే. ఈ సినిమాతో చరణ్ మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. డాషింగ్ డైరెక్టర్ ఇండస్ట్రీ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున ... ఇలా అందరితో సినిమాలు చేసారు కానీ మెగాస్టార్ ను మాత్రం డైరెక్ట్ చెయ్యలేకపోయారు.


ఈ విషయం పక్కన పెడితే, లైగర్ పాన్ ఇండియా డిజాస్టర్ తో తీవ్ర నిరాశలో మునిగిపోయిన పూరికి మెగాస్టార్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. గాడ్ ఫాదర్ చిత్రీకరణ మరియు ప్రచార కార్యక్రమాల్లో చిరుతో అనుబంధం పెంచుకున్న పూరి ఆయనకు ఒక స్టోరీ లైన్ చెప్పి ఇంప్రెస్ చేశారట. ఇందుకు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. ఎట్టకేలకు చిరు ని లైన్ లో పెట్టి, లైగర్ డిజాస్టర్ తన క్రేజ్ ను ఏ మాత్రం తగ్గించలేదు అని పూరి ప్రూవ్ చేసారు. మరైతే, ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa