సాయి రోనక్, అంకితా సాహా జంటగా నటించిన చిత్రం "రాజయోగం". రామ్ గణపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అరుణ్ మురళీధరన్ సంగీతం అందిస్తున్నారు.
రీసెంట్గానే రాజయోగం టీజర్ ను హీరో విశ్వక్ సేన్ విడుదల చెయ్యగా, తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు డిసెంబర్ 14వ తేదీన అంటే రేపు ఉదయం తొమ్మిదింటికి స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన 'రాసి పెట్టి' లిరికల్ సాంగ్ విడుదల కాబోతుంది. విశేషమేంటంటే, ఈ సాంగ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా విడుదల కాబోతుంది.
శ్రీ నవబాలా క్రియేషన్స్ , వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై మని లక్ష్మణ్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.