గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ని లాక్ చేసారు. వీరసింహా రెడ్డి జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న జరగనుంది అని సమాచారం.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల, పవన్ కళ్యాణ్ వీరసింహారెడ్డి సెట్స్లో బాలకృష్ణను కలిశారు. ఒకవేళ ఆ రూమర్ నిజమైతే ఇద్దరి నటుల అభిమానులకు పండగే.
ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.