అల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార మరియు స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటించిన 'గోల్డ్' చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ గా విడుదల అయ్యింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలమయ్యి బాక్స్ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది.
ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు, ఈ నెల 29న ఈ సినిమా ఓటిటిలో ప్రీమియర్గా ప్రదర్శించబడుతుంది అని సమాచారం. కామెడీ-డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో అజ్మల్ అమీర్, కృష్ణ శంకర్, శబరీష్ వర్మ తదితరులు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు.
పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మరియు మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి రాజేష్ మురుగేశన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa