వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ ఆంథోనీ మట్టిపల్లి రూపొందించిన చిత్రం "గీతసాక్షిగా". బుల్లితెర నటుడు ఆదర్శ్, చిత్ర శుక్ల జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, అనితా చౌదరి, రాజా రవీంద్ర, రూపేష్ శెట్టి, భరణి శంకర్ కీలకపాత్రల్లో నటించారు.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. లేటెస్ట్ గా గీతసాక్షిగా రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ పోస్టర్ విడుదలైంది. ఈ మేరకు రిపబ్లిక్ డే 2023న అంటే జనవరి 26న గీతసాక్షిగా మూవీ థియేటర్లకు రాబోతుందని తెలుస్తుంది.
చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై చేతన్ రాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆయనే ఈ సినిమాకు కథను కూడా అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa