హైదరాబాద్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి నేహా దేశ్ పాండే భర్త మైరాన్ మోహిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ ఎడ్విన్ కేసులో మైరాన్తో పాటు హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త కృష్ణకిషోర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దేశంలో పలుచోట్ల డీజే పార్టీలు, ఈవెంట్లు నిర్వహించే మైరాన్... డీజే ముసుగులో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. గత 12 ఏళ్లుగా డ్రగ్స్ సరఫరాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు వెల్లడైంది.హైదరాబాద్లోని ఓ పబ్లో మైరాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కృష్ణకిషోర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పలు కాంట్రాక్టులు చేస్తున్నాడు. ఎడ్విన్, మైరాన్ మోహిత్లతో పరిచయం పెంచుకున్న కృష్ణకిషోర్ రెడ్డి వారి ద్వారా ఇతర వ్యాపారవేత్తలు, సినీ నటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.