అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'కళ్యాణం కమనీయం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన ప్రియా భవానీ శంకర్ జంటగా నటిస్తుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14, 2023న విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజా అప్డేట్ ప్రకారం, టాలీవుడ్ బ్యూటీ క్వీన్ అనుష్క శెట్టి ఈరోజు సాయంత్రం 05:04 గంటలకు కళ్యాణం కమనీయం థియేట్రికల్ ట్రైలర్ను డిజిటల్గా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఆన్లైన్లో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. యువి కాన్సెప్ట్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమ్నేని కెమెరావర్క్ అందించారు.