ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దర్శకుడు కట్టా రంగారావు కన్నుమూత..

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 14, 2019, 07:48 PM

ప్రముఖ దర్శకులు కట్టా రంగారావు అనారోగ్యంతో హైదరాబాదులో కన్నుమూశారు. 1957 మే 5వ తేదీ జన్మించిన కె. రంగారావు 'ఇంద్రధనస్సు' చిత్రంతో దర్శకులుగా మారారు.  తెలంగాణకు చెందిన ఈ డైరెక్టర్ కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చాడు. అతను 1957 మే 5న జన్మించాడు. అతను ఇంద్రధనుస్సు చిత్రంతో దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. 1990ల్లో కమర్షియల్ సినిమాలు తెరకెక్కించాడు. ఇంద్ర ధనుస్సు, ఆఖరి క్షణం, ఉద్యమం, అలెగ్జాండర్, నమస్తే అన్నా, బొబ్బిలి బుల్లోడు, వారెవా మొగుడా, చెప్పుకోండి చూద్దాం లాంటి చిత్రాలను రూపొందించాడు. 40ఏళ్ల‌కు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయ‌న దర్శకుల సంఘంలోనూ ప‌నిచేశాడు. తన సినీ కెరీర్ ఆరంభంలో విప్లవ భావజాల సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నాడు.అతను చివరగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు,    సూర్యాపేట జిల్లా లోని మేడారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. దర్శకుల సంఘంలో ను పలు కీలక బాధ్యతలను నిర్వర్తించిన కే రంగారావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa