బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా జనవరి 13, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం ఇప్పటికే ఎలైట్ $1 మిలియన్ మార్క్ను క్రాస్ చేయగా ఆదివారం చివరి నాటికి, ఈ చిత్రం USA బాక్సాఫీస్ వద్ద $1.7 మిలియన్లకు పైగా వసూలు చేసింది. రానున్న రోజులలో ఈ సినిమా $2 మిలియన్ క్లబ్ లో జాయిన్ అవుతుంది అని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa