క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరిహరవీరమల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో భారీ స్థాయిలో మౌంట్ చేయబడుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 30, 2023న విడుదల కానుంది.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎపిక్ సినిమా ఈ వేసవి సీజన్లో థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వాళ్ళ ఈ ఏడాది చివరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్.
ఈ సినిమాలో బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, సిజ్లింగ్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాన్-ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.