సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీ "మైఖేల్" నుండి నిన్న అనసూయా భరద్వాజ్, వరుణ్ సందేశ్ ల పరిచయ పోస్టర్లు విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ సీనియర్ నటుడు అయ్యప్ప శర్మ ని మైఖేల్ ప్రపంచంలో 'ది బిషప్' స్వామి గా పేర్కొంటూ ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేసారు.
రంజిత్ జయకొడి డైరెక్షన్లో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీరోల్స్ లో నటిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది.