ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణికర్ణిక టీమ్ ను సన్మానించిన రాష్ట్రపతి

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 19, 2019, 11:53 AM

స్వాతంత్య్ర సమరయోధురాలు - క్వీన్ ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా `మణికర్ణిక` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. తెలుగు - తమిళం - హిందీలో ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేసేందుకు కంగన టీమ్ సన్నాహకాల్లో ఉంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కి పలువురి సెలబ్రిటీల ప్రశంసలు దక్కాయి.

తాజాగా ఈ సినిమాని వారం రోజుల ముందే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి స్పెషల్ షో ప్రదర్శించడం విశేషం. దిల్లీ రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ఈ షోని వీక్షించారు ప్రథమ పౌరుడు. రామ్ నాథ్ తో పాటుగా భాజపా సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ ఈ ప్రివ్యూని వీక్షించారు. ఈ సందర్భంగా షో అనంతరం రామ్ నాథ్ - ఎల్.కె.అద్వానీ - క్వీన్ కంగన - మణికర్ణిక రచయిత విజయేంద్ర ప్రసాద్ - ప్రసూన్ జోషి తదితరులు ఫోటోలకు ఫోజులిచ్చారు.  ఆ ఫోటోల్ని రాష్ట్రపతి భవన్ సోషల్ మీడియా వర్గాలు అధికారికంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కంగనను - మణికర్ణిక టీమ్ ను రాష్ట్రపతి సన్మానించడం మరో హైలైట్.

మణికర్ణిక షో వేయాల్సిందిగా రాష్ట్రపతి రామ్ నాథ్ అంతటి వారే స్వయంగా క్వీన్ కంగన టీమ్ ని కోరడం .. ఆ వెంటనే తమ కోసం ప్రత్యేకంగా ప్రివ్యూ షోని ఏర్పాటు చేయడం ఆసక్తికరం. ఇది ఓ రకంగా కంగనకు దక్కిన అరుదైన గౌరవం అనే చెప్పాలి. ఝాన్సీ రాణి పాత్రలో నటించడం ఓ అదృష్టం అనుకుంటే - ఇప్పుడు దేశ ప్రథమ పౌరుడే సినిమా వీక్షించేందుకు ఆసక్తి చూపడం అరుదైన గౌరవం అనడంలో సందేహం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa