నాచురల్ స్టార్ నాని కెరీర్ లో భారీ బడ్జెట్టుతో రూపొందుతున్న చిత్రం "దసరా". ఈ సినిమాతోనే నాని పాన్ ఇండియా హీరోగా మారబోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతోనే శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ న్యూస్ ప్రకారం, దసరా సినిమా రెండు భాగాల్లో విడుదల కాబోతుందని ఎక్క్లూజివ్ గా తెలుస్తుంది. ఈ మేరకు అతి త్వరలోనే మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రాబోతుందంట. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం మార్చి 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
పోతే, ఈ నెలాఖరున అంటే జనవరి 30న దసరా టీజర్ విడుదల కాబోతుంది.