శాండల్వుడ్ స్టార్ హీరోస్ ఉపేంద్ర అండ్ కిచ్చా సుదీప్ ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి 'కబ్జా' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. 1947 అండ్ 1984 నాటి అండర్ వరల్డ్ చుట్టూ ఈ స్టోరీ వెళ్లనుంది అని సమాచారం. ఇప్పటికే విడుదలైన కబ్జా టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. తాజాగా మూవీ మేకర్ ఈ చిత్రాన్ని మార్చి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ పాన్ ఇండియా మూవీలో మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఎం కామరాజ్, కబీర్ దుహన్ సింగ్, బొమన్ ఇరానీ కనిపించనున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ 7 భారతీయ భాషల్లో విడుదల కానుంది. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa