నందమూరి హీరో, రాజకీయ నాయకుడు తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే కొనసాగుతుంది. లోకేష్ మొదలెట్టిన యువగళం పాదయాత్రలో నడుస్తూ, ఒక్కసారిగా గుండెపోటుతో కూలబడిపోయారు. ఆ వెంటనే కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయ లో చికిత్స పొందుతున్నారు.
తారకరత్న వెంటే బాలకృష్ణ ఉండి, అన్ని దగ్గరుండి చూసుకుంటుండగా, నిన్న సాయంత్రమే నారా చంద్రబాబు నాయుడు గారు బెంగుళూరు చేరుకొని, తారకరత్న ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ రోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సతీసమేతంగా బెంగుళూరు చేరుకొని, చికిత్స తీసుకుంటున్న తారకరత్నను పరామర్శించారు.
తాజాగా తారకరత్నను పరామర్శించేందుకు హీరో మంచు మనోజ్ బెంగుళూరు బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు ఆయన బెంగుళూరు ఎయిర్పోర్ట్ లో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.