ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ పాన్-ఇండియన్ చిత్రంలో తన భాగాన్ని ముగించిన బద్రి నటి

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 04:10 PM

వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపుర్ సనాన్ అండ్ ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ సినిమాలో బద్రి నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ హేమవతి లవణం అనే క్యారెక్టర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు, ఆమె ఈ చిత్రానికి సంబంధించిన తన షూటింగ్ భాగాన్ని ముగించినట్లు సమాచారం. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ లో షేర్ చేసి మొత్తం మూవీ టీమ్‌కి ధన్యవాదాలు తెలిపింది.

ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com