ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో ఛాన్స్‌ కొట్టేసిన ‘ఫిదా’ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2017, 11:44 AM

చెన్నై: తనదైన శైలిలో చిత్రాలను చేస్తూ ముందుకు దూసుకుపోతున్న తమిళ కథానాయకుడు ధనుష్‌. తమిళంలోనే కాదు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఆయన చిత్రాలు విడుదలవుతున్నాయి. బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో ధనుష్‌ నటించిన చిత్రం ‘మారి’. బాక్సాఫీస్‌ వద్ద కమర్షియల్‌ హిట్‌ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘మాస్‌’ పేరుతో విడుదల చేశారు. ఇప్పుడు ధనుష్‌ ఈ చిత్రానికి సీక్వెల్‌ చేసే పనిలో ఉన్నారు. ఇందులో కథానాయికగా చిత్ర బృందం సాయిపల్లవిని ఎంపిక చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై ధనుష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ నటుడు టోవినో థామస్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే నెలలో ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానుంది.


మలయాళ ‘ప్రేమమ్‌’తో ఆకట్టుకున్న సాయిపల్లవి ఇటీవల శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’లోనూ అలరించింది. ఇప్పుడు ధనుష్‌ సరసన ‘మారి2’లో అవకాశం దక్కించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa