మెహర్ రమేష్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2023లో విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు చిరు స్వయంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ లేదా మేలో థియేటర్లలోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మూవీ టీమ్ కి మరింత సమయం కావాలని అందుకే ఆగస్ట్ లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రకటన చిత్ర బృందం త్వరలో ప్రకటించనుంది. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ మూవీ వేదాళం యొక్క అధికారిక తెలుగు రీమేక్.
ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తోంది. రావు రమేష్, మురళీ శర్మ, తులసి, వెన్నెల కిషోర్, కీర్తి సురేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.