యువనటుడు కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". కొత్త దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో మల్టీ జానర్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలై ప్రేక్షకుల విశేష మన్ననలను అందుకుంటుంది. ఇప్పటివరకు ఈ సినిమాను పలువురు సెలెబ్రిటీలు మెచ్చుకోగా, తాజాగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి VBVK చిత్రబృందాన్ని అభినందించారు. మురళి కిషోర్ కి అభినందనలు తెలియచేస్తూ పూల బొకేని అందించారు.
కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మురళి శర్మ, ఆమని, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ కీరోల్స్ లో నటించారు.