ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య, మాజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ఏం చేసిందో తెలుసా..? గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటింది. ఈ సందర్భంగా మహిళందరూ కూడా మొక్కలు నాటి ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆమె విన్నవించుకున్నారు.
ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం విజయవంతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. భావితరాలకు బంగారు భవిష్యత్తుతో పాటుగా ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఎంపీ సంతోష్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు అనే తేడా లేకుండా దిగ్విజయ స్పందన వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa