అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో యంగ్ హీరో అశ్విన్ బాబు హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'హిడింభ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తన ఎకె ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సమర్పిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.
నందితా శ్వేత, సుభలేఖ సుధాకర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. SVK సినిమాస్ బ్యానర్పై గంగపట్నం శ్రీధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వికాస్ బాదిసా సంగీతం అందించారు.