ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శోభితా ధూళిపాలకు చేదు అనుభవం...

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 28, 2019, 09:11 PM

మాజీ మిస్ ఇండియా, ‘గూఢచారి’ ఫేం హీరోయిన్ శోభితా ధూళిపాలకు చేదు అనుభవం ఎదురైంది. 2013లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని, మిస్ ఎర్త్‌గా కూడా పోటీల్లో నిలిచిన ఈ సుందరి, ఓ సినిమా షూటింగ్ కోసం బుర్ఖా వేసుకోవడమే అవమానం జరగడానికి కారణమైంది. బుర్ఖా వేసుకున్న తనకు జరిగిన అవమానాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ తెలుగమ్మాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే... ప్రస్తుతం బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శోభితా. ఓ సినిమాలో ముస్లిం యువతిగా నటిస్తోంది.
ఇందులో భాగంగా బుర్ఖా వేసుకుని, ముస్లిం అమ్మాయిలా తయారై హోటెల్‌కి వెళ్లింది శోభితా. బుర్ఖాలో ఉండడం వల్ల హోటెల్ రిసెప్షనిస్ట్, శోభితాను గుర్తించలేదంట... తన రూమ్ తాళం ఇచ్చేందుకు వెనకాడడమే కాకుండా అనుమానంతో ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడట. ఈ విషయాన్నే సోషల్ మీడియాలో ప్రస్తావించింది శోభితా. నేను బుర్ఖా వేసుకుని ఉండడం వల్ల, హోటెల్ రిసెప్షనిస్ట్ నన్ను గుర్తుపట్టలేదు. రూమ్ కీ ఇవ్వమని అడిగితే... ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ విసిగించాడు. షూటింగ్ నుంచి నేరుగా హోటెల్‌కి వెళ్లడం వల్ల నా బ్యాగు, దుస్తులు కూడా దుమ్ముపట్టి ఉన్నాయి. అందుకే నన్ను అంతలా అనుమానించి, నాతో అనుచితంగా ప్రవర్తించాడు. బుర్ఖా తీసి నేను శోభితాను అని చూపించాలని అనిపించింది. అయితే అతను అలా చేయడం చాలా బాధేసింది.సామాన్య ప్రజలు ఇలా ఎన్ని అవమానాలు ఎదుర్కుంటున్నారో అని ఆలోచించగానే బాధేసింది... అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శోభితా. అడవి శేషు హీరోగా వచ్చిన ‘గూఢచారి’ సినిమా ద్వారా తెలుగువారికి పరిచయమైన ఈ తెనాలి అమ్మాయి... ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘ది బాడీ’, ‘మెయిడ్ ఇన్ హెవెన్’, ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa