ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు సంవత్సరాల తరువాత సాయి పల్లవి చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2019, 05:26 PM

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసింది సాయి పల్లవి. అందం కి తోడుగా తన నటనను అభిమానించే వాళ్ళు చాల మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు.   నటన పరంగా సాయిపల్లవి ప్రతిభకు సక్సెస్ కూడా తోడుకావడంతో, తెలుగు .. తమిళ భాషల్లో తీరిక లేకుండా సినిమాలు చేస్తోంది. ఇంత బిజీగా ఉండటం వల్లనే తన మాతృభాష అయిన మలయాళంలో 3 సంవత్సరాలుగా సినిమా చేయలేకపోయింది.

మూడు సంవత్సరాల తరువాత మళ్లీ మలయాళంలో ఆమె 'అథిరన్' అనే ఒక సినిమా చేస్తోంది. వివేక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, ఫహాద్ ఫాసిల్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇటీవల కాలంలో తెలుగు .. తమిళ భాషల్లో సాయిపల్లవి చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. అందువలన ఈ సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఆమె నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa