ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేమేంటో ఈ ఇద్దరికి చూపిస్తాం -పవన్‌కళ్యాణ్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 04, 2019, 10:53 PM

టిడిపితో జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌ రహస్య అవగాహన కుదుర్చుకున్నాడని గత కొంతకాలంగా వైసీపీ నేతలు విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వైసీపీ ముఖ్యనాయకుడు విజయ్‌సాయిరెడ్డి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పోటీ చేస్తోన్న వైజాగ్‌లోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేసి పవన్‌కళ్యాణ్‌పై విమర్శలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశాడు. ఈ విషయంపై పవన్‌ స్పందిస్తూ, అసలు ఎవరేం చేయాలో చెప్పడానికి విజయసాయిరెడ్డి ఎవరు? ఆయన పని ఆయనను చూసుకోమనండి. ఏ పార్టీ ఎలా ఉండాలో చెప్పడానికి విజయసాయిరెడ్డి, జగన్‌, చంద్రబాబులు ఎవరు? పిచ్చి మాటలు మాట్లాడే వారికి కాలమే సమాధానం చెబుతుంది. చంద్రబాబు, జగన్‌లకు ఊడిగం చేయకపోతే వారు ఎవరినైనా అవకాశ వాదిగానే చిత్రీకరిస్తారు. మేమేంటో ‘ఈ ఇద్దరికి చూపిస్తాం’ అంటూ ఘాటుగా స్పందించాడు. ఎవరైనా సరే ఆ పదప్రయోగాన్ని మార్చుకోవాలి. పోటీ చేసే అభ్యర్ధులకు వేల కోట్లు ఉండాలా? ఉన్నత వర్గాలకు చెందిన వారే అయి ఉండాలా? అని పవన్‌ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa