ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'చిత్రలహరి' నాకెంతో స్పెషల్ – సుప్రీం హీరో సాయితేజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2019, 01:42 AM

 


సుప్రీమ్‌ హీరో సాయి తేజ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'చిత్రలహరి'. నివేదా పేతురాజ్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్స్‌. ఏప్రిల్‌ 12న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో థియేట్రికల్‌ ట్రైలర్‌ను కొరటాల శివ, సుకుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా... సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ మాట్లాడుతూ - ''కొరటాల శివ, సుకుమార్‌గారికి థాంక్స్‌. మా సినిమాకు ప్రారంభంలో ఎంతో బూస్ట్‌ ఇచ్చారు. మైత్రీ మూవీస్‌, చిత్రలహరి మూవీ నాకు స్పెషల్‌. ఎందుకంటే ఆరు సినిమాల ప్లాప్‌ తర్వాత నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి థాంక్స్‌. కిషోర్‌ ఎప్పటి నుండో పరిచయం. దేవిశ్రీ మ్యూజిక్‌కి నేను పెద్ద ఫాలోవర్‌ని నేను. ఆయనతో పనిచేయాలని మా అమ్మగారు కోరుకున్నారు. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. మా సినిమాకు ఆయన మ్యూజిక్‌ సపోర్ట్‌గా నిలిచింది. సునీల్‌ అన్నతో సినిమా చేయాలనుకునేవాడిని. ఈ సినిమాతో కూడా ఆ కోరిక తీరింది. వెన్నెలకిషోర్‌, పోసానిగారితో పనిచేశాను. మా హీరోయిన్స్‌ కల్యాణి, నివేదాలకు థాంక్స్‌. ఎన్ని ప్లాపులొచ్చినా, హిట్స్‌ వచ్చినా ఈ స్టేజ్‌పై ఉన్నానంటే కారణం మా మావయ్యలు.. మెగాభిమానులు. అందరికీ థాంక్స్‌. నన్ను తేజు బాబు అని పిలవొద్దు. తేజు అని పిలిస్తే చాలు. ఏప్రిల్‌ 12న విడుదలవుతున్న సినిమాను పాటల్ని హిట్‌ చేసినట్టే చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.




 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa