ఎఫ్ 2 తరువాత వెంకటేష్ చేస్తున్న సినిమా వెంకి మామ. నాగచైతన్య తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ చేశారు. ప్రస్తుతం కాశ్మీర్ లో లాంగ్ షెడ్యూల్ జరుగుతున్నది. బోర్డర్ కు పల్లెటూరికి ఉన్న సంబంధం ఏంటి అన్నది సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. సెప్టెంబర్ 13 వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని చేయబోతున్నారని వార్తలు అందుతున్నాయి. అయితే, ఆ డేట్ ఎందుకు ఫస్ట్ చేశారనే విషయం తెలియదు. ఇది కేవలం పుకార్లేనా లేదంటే నిజంగానే ఆ డేట్ కు సినిమా రిలీజ్ అవుతుందా అన్నది తెలియాలి. ఎన్టీఆర్ తో జై లవకుశ తరువాత దర్శకుడు బాబీ చేస్తున్న సినిమా ఇదే. ఇందులో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa